Every Vote Matters for Democracy
ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది!
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోనే ఉంటుంది.ఆ శక్తి ఓటు రూపంలో మనకు లభించింది. ఒక్క ఓటు విలువ లేదని అనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద నష్టం.అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే విజయం లేదా ఓటమి నిర్ణయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది.పాలన దిశను మార్చుతుంది.ఓటు హక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు,పోరాటాల ఫలితంగా అది మనకు దక్కింది.అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నా ఒక్కరితో ఏమవుతుందిలే అనుకోవద్దు.ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు,మన కర్తవ్యమూ.నేడు వేసే ఒక్క ఓటే రేపటి మంచి భవిష్యత్తుకు పునాది గా మారుతుంది.
