Rajesh Leads Massive Campaign
స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్
విజయానికి అన్ని వర్గాల మద్దతు తనకే అని ధీమా వ్యక్తం
ఇంటింటికి బొట్టు పెట్టి ఓట్లు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారం
తాండూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చీరల రాజేష్ స్థానిక ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజేష్ తమ గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో బీసీ రిజర్వేషన్ రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది.చీర్ల రాజేష్ ఇదివరకే ఉపసర్పంచ్ పదవిలో కొనసాగి ప్రజా సమస్యలపై పట్టున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. తను గ్రామానికి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అంతేకాకుండా గ్రామస్తులతో తనకు తన కుటుంబానికి ఎనలేని ఆప్యాయత అనుబంధం ఉందని అన్నారు.తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని, తనే పోటీలో సర్పంచ్ అభ్యర్థి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
