"Congress Leader Kotha Ramappa Passes Away"
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త రామప్ప మృతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
◆:- మాజీ మంత్రివర్యులు,జహీరాబాద్ ఇంచార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గుంతమర్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్త రామప్ప మృతి చెందిన వార్త తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ. చంద్రశేఖర్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రామప్ప సేవలను ఆయన స్మరించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ గారు, నాయకులు మోహన్ రెడ్డి గారు, సంగారెడ్డి గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
