Major Congress Leaders Join BRS in Jahirabad
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన నాయకులు గులాబీ కండువా లతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండలం కేంద్రం లో టి.సంగమేశ్ మారత్తమ్మ , మొహమ్మద్ రఫ్ మరియు 20 మంది కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది వారికి గులాబీ కండువాలు తో బిఆర్ఎస్ పార్టీ ఆహ్వానించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులందరూ సమిష్టిగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజి ఎంపిపి బొగ్గుల సంగమేశ్వర్, మాజి సర్పంచ్ లు జగదీశ్వర్ ,శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఏజెస్ బాబా,మాజి ఉప సర్పంచ్ లు బషీర్,హమీద్,బాల్ రాజ్, అతీక్ ,విలాస్, సామెల్, అజర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు..
