Warrant Issued Against Accused; Bail Person Sentenced
నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష
జైపూర్,నేటి ధాత్రి:
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో చెన్నూర్ కోర్టు నుండి నేరస్తునికి వారెంట్ జారీ చేస్తూ,జామీను వ్యక్తికి జైలు శిక్ష విధించారని జైపూర్ పోలీసులు తెలిపారు.2020లో రామారావు పేట గ్రామానికి చెందిన రేగుంట రాజలింగు తో పాటు కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న కేసులో స్థానిక పోలీస్ స్టేషన్ లో మురళి పై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపారు.నేరస్తుడు కోర్టు పేషీలకు హాజరు కాకపోగా వారెంట్ జారీ చేశారన్నారు.బెల్లంపల్లి మండలం గురజాలకు చెందిన ఎండి నసీర్ మురళికి షూరిటీ ఇచ్చినందుకు చెన్నూర్ కోర్టు జడ్జి రవి రెండు నెలలు జైలు శిక్ష విధించారని వివరాలు వెల్లడించారు.
