RDO Inspects Nomination Centers in Nallabelli
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో ఉమారాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీవో ఉషారాణి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపటినుండి నామినేషన్ తీసుకునే(9) క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, పంచాయతీ కార్యదర్శులు ధర్మేందర్, రజిత, ప్రశాంత్, కారోబార్ పులి చక్రపాణి సిబ్బంది తదితరులు ఉన్నారు.
