Congress Leaders Join BRS Party in Zahirabad
బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు మాజి సర్పంచ్ కృష్ణ, మాజి ఎంపీటీసీ బాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి వార్డ్ మెంబర్ లు ఆడివయ్య,ప్రవీణ్,డైరెక్టర్ సాయిలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తల్లారి రవి కుమార్,ఆనందం,సురేష్, గోపాల్,మల్లేశం,అశోక్, యాదవులు తదితరులు ఉన్నారు.
