Leaders Recall Phule’s Ideals
జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం
నర్సంపేట,నేటిధాత్రి:
సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కోరబోయిన కుమారస్వామి హన్మకొండ శ్రీధర్ అన్నారు. సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అయన 135వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్నో త్యాగాలుచేసి సాధించిన ఎన్నో హక్కులను నేటి పాలకులు మెజార్టీ ప్రజలకు దక్కకుండా చేస్తున్నారు. ప్రైవేటికరణ, ప్రపంచీకరణ, పట్టనీకరణకు పాలకుల దోపిడితోడై ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, కలకోట అనిల్, బిట్ర స్వప్న ,ఉదయగిరి నాగమణి, సరిత, యాక లక్ష్మి, సంతోష్, రవి, ఎడ్ల శివకుమార్, ఐటిపాముల వెంకన్న, వీరన్న, ప్రశాంత్, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.
