Controversy Over Ration Cards in Parvathagiri
ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు
సన్న బియ్యం కంపెనీలో 90% ఖర్చును భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డు పై లేకపోవడం విడ్డూరం
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం పై మహేందర్రెడ్డి విమర్శలు చేశారు.
ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల పోటో ఏంటి. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డ్ పై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకు ఎలా ఇస్తాడు. అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార కుందూరు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.
దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అని మహేందర్ రెడ్డి అన్నారు.
