Teacher Suresh Wins District Award
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో క్రిష్ణాపూర్ ఉపాధ్యాయుడు సురేష్ కు అవార్డు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు నారాయణఖేడ్ లో జరిగింది. ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఝరాసంగం మండలం క్రిష్ణాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు యం. సురేష్ కు జిల్లా స్థాయిలో అవార్డు దక్కింది. ముగింపు సమావేశంలో విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు, నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పట్టభద్రుల ఎం ఎల్ సి అంజిరెడ్డి, డి.యస్. పి, సబ్ కలెక్టర్ ఉమాహారతి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకున్నారు.
