Request for Sand Permissions for Indiramma Housing
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మఇండ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఏఐటీయూసీ. రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ఎమ్మార్వో జయంత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి. ఇసుక .అందలేక నిర్మాణాలు ఆగిపోతున్నాయననీ దీనివలన నిర్మాణాలు పూర్తి కావలసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ఆగిపోవడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని తంగళ్ళపల్లి ఎమ్మార్వో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రతిరోజు ఇసుక అనుమతులు ఇవ్వవలసిందిగా. కోరుతూ ఇసుక అధిక ధరలు కావడంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు. అర్థిక భారంతో. డబ్బులు చాలీచాలక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారనీ అలాగే భవన నిర్మాణ కార్మికులు నిర్మాణపు పనులు లేకపోవడంతో నిర్మాణాలకు వచ్చేవారి కుటుంబాలు విధిన పడే పరిస్థితులు ఎదురవుతున్నాయని. కార్మికులు. ఇతర కూలీలు. చాలా అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఇట్టి విషయాలన్నిటిని. పరిగణలoలోకి. తీసుకొని. కార్మికులపై ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారులపై దయతలిచి. ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర నిర్మాణ పనులకు ఇసుకకు. అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎమ్మార్వో జయంత్ కి. ఇచ్చిన వినతి పత్రంలో కోరుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో. కడారి రాములు. అజ్జి .వేణు. వడ్డేపల్లి లక్ష్మణ్. ఎం చంద్రయ్య తదితరులు వినతి పత్రంఇచ్చిన వారిలో ఉన్నారు
