Request for SC Community Hall Land
ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం
పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్
జైపూర్,నేటి ధాత్రి:
ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ సోమవారం జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డికి వినతిపత్రం అందించారు.పౌనూర్ గ్రామంలో 500 పైగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన వాళ్లు నివసిస్తున్నారు వారికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందికు గురవుతున్నట్టు పేర్కొన్నారు.ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడం వల్ల దళిత వర్గాల యువత,మహిళలు,సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు తగిన సదుపాయాలు లభిస్తాయని ఇలాంటి కమిటీ హాల్ దళితుల అభివృద్ధికి సామాజికంగా ముందుకు వెళ్లడానికి సహాయపడతాయని అన్నారు.తహసిల్దార్ వనజా రెడ్డి వెంటనే స్పందించి స్థలం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.
