Grain Purchase Center Launched in Narsampet
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ విగ్నేశ్వర ఎఫ్పిఓ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ సోమవారం పట్టణంలోని ఎన్టిఆర్ నగర్ వద్ద ప్రారంభం చేశారు.ఎఫ్పిఓ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి అధ్యక్షతన జరుగగా రామానంద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరైన కాంట పద్ధతి ద్వారా కొనుగోలు చెయ్యాలని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంధ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలుగూరి మధుకర్,ఎఫ్పిఓ డైరెక్టర్ చింతల సాంబరెడ్డి,బుర్ర మోహన్ రెడ్డి, చిలువేరు వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు చిలువేరు కొమ్మలు, కొమురయ్య, రేమిడి శ్రీనివాస్, లింగాల సూరయ్య,శంకర్,హనుమయ్య, గాంగడి రాజమ్మల రెడ్డి, ఈక సత్యరాయణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
