AIMIM Wins Five Seats in Bihar
బీహార్ లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలిచి సత్తా చాటింది
◆:- ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
అయితే ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలిచి సత్తా చాటింది. ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం ప్రభావం చూపించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లనే.. ఇప్పుడు కూడా గెలిచింది. దీంతో తమ కంచుకోటలను కాపాడుకున్నట్లు అయింది. కాగా, కాంగ్రెస్ కంటే మెరుగైన ప్రదర్శనతో రాజకీయ వర్గాల్లో ఎంఐఎం చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలపై తీర్పు స్పందించిన జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ .. బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
