TRASMA Condemns PDSU Attack on School
పి డి ఎస్ యు దాడీ ని ఖండిస్తున్నాం.
చిట్యాల,నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో ట్రస్మా ప్రైవేటు పాఠశాలల చిట్యాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందిహనుమకొండ పట్టణంలోని డిజి స్మైల్ స్కూల్ పైన బుధవారం రోజున పిడిఎస్యు విద్యార్థి సంఘ సభ్యులు చందా వసూళ్లకు పోయి ఆ పాఠశాల పైన దౌర్జన్యం చేసి పాఠశాల కరస్పాండెంట్ ను కొట్టడం జరిగింది దానికి నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురు వారం రోజున పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ట్రస్మా గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రమేష్ టేకుమట్ల మండలం నుండి జిల్లా ఈసీ మెంబర్ మియాపూర్ హరీష్ జిల్లా మెంబర్ గొల్ల సతీష్ కుమార్ బండి సంపత్ కుమార్ శ్రీధర్ మొగుళ్ళపల్లి మండలం నుండి శ్రీనివాస్ రవికుమార్ మొదలగు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
