Vaccination Drive Against Lumpy Skin Disease in Bhupalpally
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.
