Indira Gandhi Death Anniversary in Nallabelli
ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు.
#ఇందిరా గాంధీకి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.
#రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి,నేటిధాత్రి :
భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ మత భావజాలాలను వ్యతిరేకించిన దీరవనిత అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు.ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సెక్యులర్ భావజాలానికి అంకితమై దేశ రాజకీయాల్లో మత భావజాలాలను తీవ్రంగా వ్యతిరేకించిందని. రాజభరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయకరణ చేయడం 20 సూత్రాల పథకాన్ని తీసుకువచ్చి పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన గొప్ప మహనీయురాలు గరీబ్ హటావో అని నినాదంతో ప్రజలందరికీ అండగా నేనుంటా అని ఉత్తేజపరిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఇందిరమ్మ ఆమె లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఇందిరమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త తీసుకొని రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని.భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం,దేశ అభివృద్ధి కోసం, అనేక సరళీకృత సంస్కరణలు చేసి దేశంలో గ్రీన్ రెవల్యూషన్ విజయం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయురాలుగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పెంతల కొమరారెడ్డి, కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, నాయకులు చిట్యాల ఉపేందర్ రెడ్డి, జంగిలి మోహన్, మాందాటి శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేష్, ఒల్లె పైడి, కోడెం బిక్షపతి, దూలపల్లి రవీందర్రావు, మూడు స్వామి, మచ్చిక మహేష్, కొనుకటి రమేష్, బత్తిని మల్లయ్య, గద్దల సురేష్, బోట్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు.
