Google’s AI City Project to Transform Visakhapatnam
*గూగుల్ రాకతో రాష్ట్రానికి ఆదాయంతో పాటు మెండుగా ఉద్యోగ అవకాశాలు.
*మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్16
గూగుల్ రాకతో ఎఐ సిటీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతొందని దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు చేకూరనున్నాయని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని వివరిస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిశాఖపట్నంలో ఒక గిగావాట్ (
జి డెబ్యూ) హైపర్స్కల్ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు,
కూటమి ప్రభుత్వం చొరవతో, వైజాగ్లో ఏర్పడుతున్న ఏఐ సిటీకి దాదాపు 10 బిలియన్ లు పెట్టుబడి పెట్టనుందన్నారు,
ఆసియాలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా విశాఖపట్నంలో ఈ సెంటర్ నిలవనుందన్నారు,
రాష్ట్రం ఒక స్వర్గధామంగా మారుతోంది. వైజాగ్ లో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని డిజిటల్ పవర్ హౌస్ మార్చే దిశగా తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం,ఈ ప్రాజెక్ట్ 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టించనుందని వివరించారు,
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు,
మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందనిసీఎం చంద్రబాబు బ్రాండింగ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖకు వచ్చేసిందన్నారు,
దేశంలో సురక్షిత నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేటర్ విశాఖపట్నం.. ఇప్పుడు ఐటీ, డేటా సిటీ నగరంగా రూపాంతరం కానుందన్నారు
