
BJP Leader Oora Naveen Supports Bereaved Families
మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఊర నవీన్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల బీజేపీ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించినటువంటి కుటుంబాలు కొండాపూర్ గ్రామం లో మామిడి మల్లయ్య నగరంపల్లి గ్రామంలో మేకల శైలేందర్ పెద్ది సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ ఎఫ్ బి స్కీమ్ కు అప్లికేషన్ పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు డాకూరి కృష్ణారెడ్డి బూత్ అధ్యక్షులు భూక్య హరిలాల్ మండల సీనియర్ నాయకులు గొర్రె రవి మామిడాల మల్లన్న ఇనుగాల మొగిలి తదితరులు పాల్గొన్నారు