పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ.

Exams Exams

పది ఫలితాల్లో 99.75 శాతం ఉత్తీర్ణత : ఎంఈఓ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

2024 25 విద్యాసంవత్సరానికి గాను -నిర్వహించిన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మండలంలో 99.75 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి మారుతి రాథోడ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విడుదలైన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. మండలంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థునులు 416 గురు పరీక్షలు రాయగా 415 గురు ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ తెలిపారు. మిర్జాపూర్ (బి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సాదియా సౌసీన్ 600 గాను 579 మార్కులు సాధించి మండలంలోని టాపర్ గా నిలిచింది.

Exams
Exams

 

మెటల్ కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి 600 గాను 565 మార్కులు, మిర్జాపూర్ (బి) ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నవీనా 600 గాను 561, మమ్మద్ జునీద్ 600 గాను 559 మార్కులు సాధించి ప్రతిభను చాటారు. న్యాల్ కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గొల్ల సాయి మార్చ్ 20న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో కేవలం మొదటి రోజు పరీక్షను మాత్రమే వ్రాసి మిగిలిన 5 పరీక్షలు వ్రాయలేక పోవడంతో మండలంలో శతశాతం ఉత్తీర్ణత సాధించలేక పోయింది. 416 గురు విద్యార్థునులకు గాను 415 గురు విద్యార్థునులు వార్షిక పరీక్షల్లో హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థునులు అందరు ఉత్తీర్ణత సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!