భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి
పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్
గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేశారని.ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం.
దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది.భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారని తన తాత వల్ల భగత్ సింగ్ ఎంతో ప్రభావితం అయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పేనక సూర్యం, ఢిల్లీ రాంబాబు, ఏర్ప శ్రీను,ముచ్చ మధు, బండారి కోరమల్లు,మచ్చ శ్రీకాంత్, కల్తీ బుచ్చి రాములు, సీడం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.