కాటారం, నేటి ధాత్రి
కాటారం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నాగరాజు, పోలీస్ స్టేషన్లో డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ గాంధీ, నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎస్సై అభినవ్, సర్పంచ్ తోట రాదమ్మ, ఎంపీటీసీలు తోట జనార్ధన్, జాడి మహేశ్వరి రమేష్, ప్రజా ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు…