స్వీప్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో 5k రన్

వేములవాడ నేటి ధాత్రి

వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున VOTE FOR SURE కార్యక్రమంలో బాగంగా 5K రన్ వేములవాడ ఆర్ డి ఓ రాజశ్వర్, డిఎస్పీ నాగేంద్ర చారీ, ఎలక్షన్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ లు జెండా ఊపి రన్ ని ప్రారంభించారు. ఈ రన్ లో బాగంగా తెలంగాణా చౌక్ నుండి తిప్పాపురం బస్ స్టాండ్ వరకు రన్ ని కొనసాగించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ను వినియోగిచుకోవాలని అదే విధంగా రానున్న పార్లమెంటరీ ఎలక్షన్ లలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా, నిజాయితిగా తమ ఓటు ని వేయాలని ఆర్డీవో కోరారు . కార్యక్రమంలో పట్టణ డి.ఎస్.పి నాగేంద్ర చారి మండల తహసిల్దార్ మహేష్ కుమార్ ఎలక్షన్ నాయబ్ తహసిల్దార్ శ్రవణ్ యువ ఫౌండేషన్ అద్యక్షులు రాజశేఖర్ ,రెవిన్యూ ఉద్యోగులు, యువ ఫౌండేషన్ అభ్యర్థులు, వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు పెద్ద ఎత్తున యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!