రక్షణ శాఖకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం
వనపర్తి నేటిధాత్రి:
చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు. భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ.

వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు