మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం

వరంగల్ /గీసుగొండ,నేటిధాత్రి :

గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మరుకాల లింగారెడ్డి తల్లి కొమురమ్మ మరణించగా వారు కాంగ్రెస్ పార్టీకీ చేసిన సేవలను గుర్తుకు చేస్తూ గురువారం అల్లం బాలకిషోర్ రెడ్డి సహకారంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అకుల రుద్ర ప్రసాద్, జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, మండల నాయకులు మాదాసి రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, గ్రామ అధ్యక్షులు ఈర్ల ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు మరుకాల మోహన్ రెడ్డి, కడారి రాజు, బట్టమాకల రాజయ్య, సాయిలి నరేందర్,సాయిలి మధు,మేరబోయిన అశోక్, జక్కుల రాజు, జె. రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!