5 లక్షలు ఎంపీ లాండ్స్ నిధులతో సైడ్ డ్రైనేజీ పనులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని 11వ వార్డులో ఎస్టి కాలనీ ప్రజలు డ్రెయినేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఇందారం ఎంపిటీసి-2 అరికె స్వర్ణ- సంతోష్ యాదవ్ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి 5లక్షల రూపాయలు మంజూరు చేపించి, శుక్రవారం రోజున సైడ్ డ్రెయిన్ పనులను ఎంపిటీసి అరికె స్వర్ణ-సంతోష్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చేద మహేందర్,మూట లక్ష్మణ్, పూజారి గంగన్న, మీనుగు దుర్గేష్ మరియు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!