నిజాంపేటలో 4 విడత సామాజిక తనిఖీ సమావేశం
నిజాంపేట: నేటి ధాత్రి
జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిజాంపేట రైతు వేదికలో సోమవారం 4 విడత సామాజిక తనిఖీ సమావేశం ఏపీడీ రంగాచారి, డీవీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు కూలీలకు వచ్చిన వేతనాలు, గ్రామాల్లో జరిగిన పనుల గూర్చి సామాజిక తనిఖీ బృందం వివరాలను సేకరించడం జరిగిందన్నారు. వాటిపై మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి , ఏపీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.