40 కిలోల కల్తీ టీ పౌడర్ పట్టివేత
ఫుడ్ సేఫ్టీ మరియు పోలీస్ అధికారులు
శాయంపేట నేటిధాత్రి:
గూడెప్పాడ్ సెంటర్ సమీపం లో గల ఎమ్ ఎమ్ మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి యు పోలీస్ శాఖ తనిఖీలు చేసి దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు అనం తరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మరియు మౌనిక నకిలీటీపౌడర్ ను ఎలా గుర్తిం చాలో డెమో చేసి చూపించా రు. ఇట్టి టీ పౌడర్ ను హెయిర్ డై (జుట్టుకు వేసే రంగు)తో తయారు చేస్తున్నారు ఇట్టి రసాయనాలు వాడటం వల్ల ప్రజలకు క్యాన్సర్ వ్యాధి మరి యు ఇతర వ్యాధుల బారిన అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు నకిలీ ఇలాంటి పౌడ ర్లను వాడకూడదు. టీ పౌడర్ అమ్మే వారికి కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో పరకాల రూరర్ సీఐ రంజిత్ రావు శాయంపేట ఎస్సై పరమే శ్వర్ దామెర ఎస్సై కొంక అశో క్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణ మూర్తి, మౌనిక పాల్గొన్నారు.
