ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 39 వినతులు…

కమిషనర్ ఎన్.మౌర్య.

తిరుపతి(నేటి ధాత్రి) జనవరి 06:

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి 39 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు.టౌన్ క్లబ్ పక్కన రోడ్డు వెడల్పు కోసం తీసుకున్న స్థలానికి టి.డి.ఆర్.బాండ్ ఇవ్వాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. కాగా తాము కొర్లగుంట మారుతినగర్ నందు నివసిస్తున్నానని,రికార్డుల్లో ముత్యలరెడ్డి పల్లి న్యూ మారుతి నగర్ గా నమోదు అయినదని మార్పు చేయాలని కోరారు. టి.డి.ఆర్.బాండ్లు ఇప్పించాలని, రాజీవ్ గృహకల్ప కింద ఇంటికోసం డబ్బులు కట్టామని ఇల్లు రాలేదు మా నగదు మాకు ఇవ్వాలని కోరారు. తాను మాజీ సైనికుడిని నాకు గృహ నిర్మాణ పథకంలో ఇల్లు ఇప్పించాలని, శివజ్యోతి నగర్ నందు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన చుట్టూ పక్కల బోర్లలో నీరు రావడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ హైస్కూల్ ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని,శేట్టిపల్లి పట్టాడారులకు రెండ్లు సెంట్లు స్థలం ఇవ్వాలని, పోస్టల్ కాలనిలో చెట్లు తొలగించాలని,సి.సి రోడ్లు వేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్,రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, మేనేజర్ హాసిమ్,హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ,డి.ఈ.లు, సూపరింటెండెంట్లు,శానిటరీ సూపర్ వైజర్ లు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!