Journalists Demand Restoration of House Pattas
37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని
మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని
ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం దుర్మార్గమని
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్… అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టుల న్యాయమైన
సమస్యను పరిష్కరించాలని మూడవరోజు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం 37 మంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యల పైన నిరంతరం కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం
