BRS Provides Support to Bereaved Family
బిఆర్ఎస్ పార్టీ నుండి 25 కేజీల బియ్యం అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన అజంతా యూత్ అసోసియేషన్ తోలి అధ్యక్షుడు అయిన మిట్టపల్లి రమేష్ తల్లి మిట్టపల్లి సరోజన మరణించినారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరుపున 25కేజీ రైస్ అందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మార్త శ్రీనివాస్, దాసరి రాములు, బి ఆర్ ఎస్ పార్టీ 2వ వార్డ్ మెంబర్ బానోత్ మధుకర్, రత్నం రాజు,భీష్మచారీ, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
