జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉల్లిగడ్డల మణెమ్మ,శ్రీశైలం కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు,వెంకటయ్య,సత్యం,మహేష్,పెంటయ్య,కృష్ణయ్య,కుమార్,జాఫర్, మన్నాన్, పర్వతాలు,శ్రీను,రాజు,యాదయ్య, సిద్దాపురం మైబు, బొంకూరు శ్రీశైలం, బొంకూరు శేఖర్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 47వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చల్లా ధర్మ రెడ్డి గెలిస్తేనే పరకాలకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్ని రకాల కులమత అనే భేదాలు లేకుండా అందరికీ సమాన అభివృద్ధి అందిస్తాడని ఈనెల 30వ తారీఖున మూడో నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా హైట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచి మంత్రి కూడా అవుతాడని ఇంకా అభివృద్ధి జరుగుతుందని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బోట్ల నరేష్ బూత్ అధ్యక్షులు మేకల దేవేందర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్కాజగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మేట్ డివిజన్ లోని సరస్వతీ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్,ఇంచార్జీ కల్వకుంట్ల వంశీ శ్రీధర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క ఓటరుని కలసి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యాలని,ప్రతి కార్యకర్త మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో పార్టీలో సముచిత స్థానం గుర్తింపు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, జీకే. శ్రీదేవి, జీవకన్, కరంచంద్, వీరేశం యాదవ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
పాయం వెంకటేశ్వర్లు పోడు పట్టాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పథకాలు మంచివి అన్న నువ్వే నేడు విమర్శించడం సరికాదు
బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోడు రైతుల గోడు చూడలేక పోడు పట్టాలను అందిస్తే మంగళవారం గుండాల మండలానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాలు చిత్తు కాయితాలతో సమానం అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సరైంది అని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోడుగోడు పట్టని పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సరైందని అన్నారు. గతంలో తాను ఉన్నప్పుడు బీఆర్ఎస్ పథకాలు గొప్పగా చెప్పిన తానే నేడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆరోపణలు చేయడం ప్రజలు గమనించాలని అన్నారు. గ్రామంలో 25 కుటుంబాలు ఉంటే వాళ్లని ఏ పార్టీకి సంబంధమో తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కండవల కప్పి షో చేశారే తప్ప తాను కొత్తగా సాధించిందేమీ లేదని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే పెద్దతోగు గ్రామానికి వెళ్లి హామీలు కురిపించి మరల ఈ ఎన్నికలకు ఆ ఊరు వెళ్ళాడు తప్ప గతంలో వాళ్లు ఎన్ని బాధలు పడ్డ తన కంటికి కనపడలేవా అని అన్నారు. పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రేగా కాంతారావు పెద్దతోగు గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఐదున్నర కోట్లతో రహదారిని మంజూరు చేయించి టెండర్ను పూర్తి చేయించారని అన్నారు. పెద్ద తోగు గ్రామ సమీపంలో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన కోసం 8 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన ఘనత రేగా కాంతారావు కె దక్కుతుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని పనులన్నీటిని ఇప్పుడు గెలిపిస్తే చేస్తానంటే ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అభివృద్ధి జరగాలంటే రేగ కాంతారావే మళ్లీ గెలవాలని పాయం వెంకటేశ్వర్లు గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందని అన్నారు. వెన్నెల బైలు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ట్రంచ్ కొడుతున్నారని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి ఆపాలని విన్నవించుకున్నప్పటికీ అది మన చేతిలో లేదు ఏమి చేయలేము అక్కడి నుండి తిరిగి రావాలని మమ్ములను పిలిపించిన పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం లోకి తర్వాత వచ్చిన రేగా కాంతారావు హయాంలో వచ్చిన పోడు పట్టాలను చిత్తుకాయితాలతో పోల్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న పాయం వెంకటేశ్వర్ల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్న రేగా కాంతారావు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి తిరుకోల్లూరి రాము, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, దొంగతోగు ఉప సర్పంచ్ పాపారావు, పార్టీ నాయకులు రాంబాబు, జోగ రాంబాబు, గాంధర్ల కిరణ్, గడ్డం వీరన్న, జాటోత్ అమృ, తదితరులు పాల్గొన్నారు.
`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.
`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.
`తెలంగాణ ను గోస పెడతరు.
హైదరాబాద్,నేటిధాత్రి:
బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి కేసిఆర్ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కాని బండి సంజయ్ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్ఎస్ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్, ఎంపి. అరవింద్ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు. కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్రావు వెల్లడిరచారు. అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్. ఇదిలా వుంటే కాంగ్రెస్ కధ మరోలా వుంది. ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది. దేశమంతా విద్యుత్ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్కు తేడా…కేసిఆర్ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.
విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం 60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్ ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి. రైతు రాజ్యాన…కేసిఆర్ నజరాన!
`రైతు వరదాత కేసిఆర్…
`రుణ విముక్తి జరిగింది.
` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.
స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే. `తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.
`కేసిఆర్ మాటంటే మాటే…
`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!
`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్ కే!
` రైతు దిగులు తీరె…
`రైతు ఇంట ఆనందమే.
` రంది తీరిన రైతుకు సంబరమే.
`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.
` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.
` 19 వేల కోట్ల సర్థుబాటు.
`అనూహ్యమైన నిర్ణయం.
` తెలంగాణ రైతుకు వరాల మూటలు.
` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.
హైదరబాద్,నేటిధాత్రి:
రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే… ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు. నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది. దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్ నామస్మరణ చేస్తోంది.
ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్ సుపరిపాలన
పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ! పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…
` హైదరాబాద్ చుట్టూ అద్భుతమైన ప్రగతి.
`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.
`ఐటిలో మేటి తెలంగాణ.
`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.
`ఫార్మాహబ్ గా తెలంగాణ.
`హైదరాబాద్ లో మరిన్ని సొగసులు.
`కొత్త కట్టడాలు.
`మహానగరంగా…విశ్వ నగరంగా
`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్ లోనే.
`బిజినెస్ సమ్మిట్ల వేధిక.
`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్ లో..
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సతీమణి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజారిటీ తో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ నెల 30న జరిగే ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు చేయాలనీ పరకాల ను అభివృద్ధి చేయాలంటే ధర్మన్న నే సరైన నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సనత్ పటేల్, పరకాల పట్టణ మాజీ మహిళ అధ్యక్షురాలు గంట కళావతి, మహిళ నాయకురాళ్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు చేయాలి.రైతులకు న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో చివరి వరకు రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలోని రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపెళ్లి జిల్లా చిట్యాలమండలం లోని నైన్ పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు రామగిరి రాజు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు యధండ్ల గణేష్ యాదవ్ లను ఆహ్వానించి సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొడుగు విజేందర్ యూత్ అధ్యక్షులు గుండు నగేష్ గొర్రె అనిల్ యాదవ్ ఉన్నారు.
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నవంబర్ 20 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని ఇట్టి ప్రత్యేక రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు.తదనుగుణంగా పిల్లల హక్కుల రక్షణకై భారతదేశం బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చట్టం(సిపిసిర్) జనవరి 20,2006 నాడు అమల్లోకి తెచ్చిందని, బాలలందరూ వారి యొక్క హక్కులు సంపూర్ణంగా పొందేలా కృషి చేస్తామని, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయాలని, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచన చేసిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, బాలల హక్కుల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్యా, విద్యా వాలంటీర్లు బాబురావు పర్శవేని జ్యోతి, ఐఆర్పి రమేష్ ఆయాలు అరుణ,సుశీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
న డి కూడ, నేటి ధాత్రి: కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణాపురం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఎండ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు,తెలంగాణను నాశనం చేశారన్నారు,మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బిజెపి పార్టీలు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయన్నారు. నేడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలి గత పది ఎండ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలి.పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు.పరకాల నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేసుకున్నాం అందులో నిర్మానవుతున్న కంపెనీలలో నియోజకవర్గంలోని యువతకు,మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొదటి బాలెట్ లో మూడో నంబర్ పైన ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి
ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?
అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.
ప్రధాన పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.!?
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మంథని నియోజకవర్గ ప్రజలకు మరియు ఓటర్లకు నేటి ధాత్రి గత 20 రోజుల నుండి ఎన్నికల నగర మోగిన అనంతరం ఓటర్లలో చైతన్యం కొరకు నిష్పక్షంగా ఓటును వినియోగించుకోవాలని గారడీలకు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని నేటి ధాత్రి వరుస ప్రజల్లో చైతన్యం కొరకు కథనాలను అందిస్తూ ఓటర్లకు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల వ్యవహారాలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. చివరికి నేటి ధాత్రి అక్షరాలు వాస్తవాలుగా తిరపతి కి రావడం జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి మంథని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పక్షాన ఓట్లు వేయాలని ప్రమాణాలు చేపిస్తున్న వీడియో తెరపైకి రావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్లు మరియు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు పార్టీకు సంబంధించిన వ్యక్తులు ప్రజల వద్దకు వెళ్లి తమ పక్షాన ఓట్లు వేయాలని ఊరుకోవడమే తప్ప ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కానీ ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం లేకపోవడంతో దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేయించి అభ్యర్థి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఎన్నికల కమిషనర్ కు సవాల్ విసిరేటట్టుగా కనబడుతుంది.
చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.
నేటి ధాత్రి చెప్పినట్లే ఒక్కొక్కటి సాక్షాలుగా తెరపైకి రావడం అర్ధరాత్రి పెద్ద మొత్తంలో మహిళను గుమ్మి గూడించుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎం ఎల్ ఏ అభ్యర్థి గెలుపు కొరకు మీరు ఓట్లు వేయాలని మహిళలతో వారి ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేయించి జై కాంగ్రెస్ అన్న నినాదాల వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. మంథని నియోజకవర్గం అసెంబ్లీ పరిధిలోని మహదేపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి మహదేవ్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు సుమారు వందకు పైబడి మహిళలను ఒక్కచోటకు చేర్చి ఎంపీపీ మహదేవ్పూర్ మేము పెద్దంపేట గ్రామ మహిళలము మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీధర్ బాబుకు కు తమ ఓటు వేస్తామని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అని ప్రమాణం మరియు ప్రతిజ్ఞ మహిళలతో చెప్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాణం చేసిన వీడియో నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు మండలంలో ప్రజలకు తమ పార్టీకి మీ ఓట్లు అందించి సహకరించండి అని ప్రచారం చేయాల్సిన ఎంపీపీ దేవుని పేరుతో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని మహిళలతో ప్రమాణాలు చేయించిన వ్యవహారాన్ని నియోజకవర్గ ఓటర్లు ప్రజలు తప్పుబడుతున్నారు.
పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజక వర్గం ఎన్నికలవేళ ప్రమాణాలతో ఓట్లు అడగడం అనే ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చిందేమో ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం కాదా అని చర్చించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ప్రజల్లో తీసుకువెళ్లి నిర్భయంగా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్దంపేట గ్రామంలో చేసిన పనిని చూపించి తమకు ఓట్లు వేసి విజయాన్ని అందించాలని చెప్పవలసిన ఎంపీపీ దేవునిపై ప్రమాణం చేయించి మనస్ఫూర్తి ఆత్మసాక్షిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రమాణం చేయించడం ఏమిటి, ఈ వ్యవహారాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గంలో ప్రజలకు గ్రామాలకు ఏమైనా పనులు చేసిందా లేక ప్రమాణాలకు పరిమితమై ఓట్లు వేయించుకునే క్రమంలో ఉందా అన్నట్లుగా ఉంది ఈ ప్రమాణాల వ్యవహారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని చూసి నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేస్తారు, కానీ ప్రజా ప్రతినిధులు వెళ్లి అమాయక మహిళలను పెద్ద మొత్తంలో ఒకచోటు చేర్చి కాంగ్రెస్ పార్టీకి మీ దేవుని పేరు మీద ఒట్టేసి ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకుంటే అమాయక మహిళలు దేవుడు మీద ప్రమాణం చేసి ఉన్నాము కదా లేకుంటే తమకు భవిష్యత్తులో ఏమవుతుందో నని భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓట్లు వస్తాయని ఆలోచనతోనే ప్రమాణాలు చేయించు కుంటున్నారేమో అని చెప్పడంలో సందేహం కాదు సాక్ష్యమే నియోజకవర్గ ప్రజల ముందు ఉంది.
ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?
ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సుమారు 28 రోజులు అభ్యర్థులకు నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారు గతంలో నియోజకవర్గంలో ఎంఎల్ఏ లుగా కొనసాగితే మీరు ప్రజలకు చేసిన సేవలను వారి దృష్టిలో పెట్టి తిరిగి గతం కంటే రాబోయే రోజుల్లో మంచి పని చేస్తామని, అలాగే ఇతర పార్టీ మరియు స్వతంత్ర అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజలకు ఒక సిపాయిలాగా బడుగు బలహీన కుల మత భేదం లేకుండా పట్టణాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల వద్దకు అందేలా ప్రజల్లో ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయ సౌకర్యాలు అందించేలా చేస్తాము తమకు మీ ఓటుతో ఆశీర్వదించండి అని ప్రజల్లో అభ్యర్థులు భవిష్యత్తు తో పాటు గతంలో చేసిన పనులను వివరిస్తూ తమకు ఓటు వేయాలని కోరడం కొరకు ఎన్నికల సంఘం ప్రచారాల కొరకు సమయాన్ని ఇచ్చింది. కానీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం ప్రచారాల సమయంలో ప్రమాణాలు చేయిస్తూ అమాయక మహిళలను ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేపించి గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారం పేరుతో ప్రమాణాలు కొనసాగించడం కచ్చితంగా తమకే ఓట్లు వేయడానికి దేవుళ్లపై ప్రమాణాలు చేయించుకోవడం ఒకవైపు ఆశ్చర్యానికి గురి చేస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమతో ప్రమాణం చేపించుకుంటారేమో నియోజకవర్గ ఓటర్లు కాస్త భయందోళన కు గురయ్యే పరిస్థితి ఈ దారితీస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల నిబంధనలను ప్రచారంలో ప్రమాణాలు చేయించుకోవడం నిబంధనలో వస్తుందా లేక నిబంధనలకు విరుద్ధఎం అనేది ఎన్నికల అధికారులే నిర్ణయించాలి.
అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.
నియోజకవర్గ ప్రజలకు నేటి ధాత్రి గత 25 రోజుల నుండి రాజ్యాంగం అందించిన అమూల్యమైన ఓటును ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నిర్భయంగా నియోజకవర్గ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు చైతన్యవంతం చేస్తూ రాజకీయ పార్టీల వ్యవహారాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతూ ప్రజలకు మరియు ఓటర్లకు వాస్తవాలతో చైతన్యం తీసుకువచ్చే విధంగా కథనాలు అందిస్తున్న నేటి ధాత్రి నేడు ప్రధాన పార్టీల వ్యవహారం కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. చివరికి నీటి ధాత్రి చెప్పిందే వాస్తవాలు తెర పైకి రావడం జరుగుతుంది. ప్రధాన పార్టీల మాయలో పడద్దని అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుందని గత 20 రోజుల నుండి నేటి ధాత్రి, చెప్పుకుంటూనే వస్తుంది, చివరికి అదే సాక్ష్యంగా అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి చీకట్లో మహిళలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని దేవుడు మీద ప్రమాణం చేయించిన వ్యవహారం నియోజకవర్గ ఓటర్ల ముందు ఉంది. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే విషయంలో ఒక నిష్పక్షంగా మీ సమస్యలను పరిష్కరించే వ్యక్తిని మీ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రమాణాలు చేయించుకునేవారు రేపు భవిష్యత్తులో మీకు ఆధ్యాత్మికంగా మీ దేవుళ్లను సాక్షిగా పెట్టి పని అడుగుతే ఒట్టు వేసుకునే పరిస్థితి వరకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రధాన పార్టీ కాంగ్రెస్,టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.
ప్రస్తుతం మంథని నియోజకవర్గం లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి లపై ప్రజలకు నమ్మకం లేదు అనడానికి పెద్దంపేట గ్రామంలో ప్రమాణం చేయించడమే సాక్ష్యం. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు పరిపాలించినప్పటికీ నేడు ప్రజల్లో ఏ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు అనేది కేవలం ఎన్నికలు తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ స్పష్టత లేకపోవడం తో పాటు పార్టీలో ప్రజా ప్రతినిధులుగా కొనసాగే వ్యక్తులు గ్రామాల్లో వెళ్లి అర్ధరాత్రి వేళ దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ఆత్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రమాణాలు చేసుకునే పరిస్థితికి రావడం జరిగిందంటే ప్రధాన పార్టీల వ్యవహారం అభ్యర్థులపై నియోజకవర్గ ఓటర్లలో నమ్మకం లేదన్నడానికి దీనికంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పాలించినప్పటికీ కూడా గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న పార్టీ అభ్యర్థులు మరి వారు చేసిన పనికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేయక తప్పదు కానీ దేవునిపై ఒట్టేసి తమ పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం ఎందుకు చేయించు కుంటున్నారు. ప్రజలకు పార్టీలపై నమ్మకం లేదా లేక పార్టీలకు ప్రజలపై నమ్మకం లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్న వ్యవహారం కానీ వాస్తవం ఏమిటంటే ప్రధాన పార్టీకు నియోజకవర్గ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కొరకు మహిళలతో దేవుని పేరుపై ప్రమాణం చేసుకొని ఓటు వేయించుకునే ప్రయత్నం అన్నది వాస్తవం.
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి పల్లె మల్లేష్(40) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎక్స్ ఎంపీపీ నర్సింలు, కో ఆప్షన్ ఆల్తాఫ్ బేగ్, బిఆర్ఎస్ పార్టీ ఉపద్యక్షులు రాచమల్ల యాదగిరి, మాజీ ఏఎంసి డైరెక్టర్ దేవేందర్, భీమగండ్ల నర్సింలు, అల్లే శ్రీనివాస్, పాల్కొండ నవీన్, అంజనేయులు బిఆర్ఎస్ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం తిప్పారం ఇంటింటా ప్రచారం లో ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్ మాట్లాడుతూ కేసీఆర్ ను మూడో సారి గెలిపించాలి అన్నాడు కేసీఆర్ ప్రబుత్వం ప్రజల ప్రబుత్వం, రైతు బీమా, రైతు బందు ఒక ఏకరానికి 10000 లు రూపాయలు ఇస్తుంది ఈసారి గేలిస్తే 16000 ఇస్తుంది
పించాన్ 2000 నుండి 5000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి 24 గంటల కరెంట్, కేసీఆర్ క్విట్ ,
ప్రవేట్ హాస్పటల్ కు దీటుగా ప్రబుత్వ హాస్పటల్ నిర్వహించారు మిషన్ బగిరథ మిషన్ కాకతీయ , వడ్ల కొనుగోలు ప్రబుత్వ సంక్షేమ పథకాల గురించి చేపుతూ, కేసీఆర్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ,కాని బిజెపి ,కాని ఇతర పార్టీలు గెలిస్తే బిల్డింగ్ కు సున్నం ఎపించార్ అన్నారు, గాడిదలకు గడ్డి వేస్తే పాలు రావు అబివృది చూసి కేసీఆర్ ను గెలిపించాలి, ఆకుల బద్రఅన్న మాట్లాడుతూ తిప్పరం లో పెంకుటిఇల్లు ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ గెలిపించి ఊరు అబివృది చేసుకుందాం అన్నారు,
ఈ కార్యక్రమంలో తిప్పారం సర్పంచ్ కర్రె లక్ష్మి రాజయ్య
మంగోల్ సర్పంచ్ కిరణ్, మత్పల్లి సర్పంచ్ మహీపాల్ తిప్పరం గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ ఆద్యక్షులు కోరే చరణ్ సినియర్ బి ఆర్ ఎస్ ఆద్యక్షుడు ఇరుసల కారుణకర్ కోరే ఈశ్వరాయ్య కిష్ట రెడ్డి నాగయ్య డబ్బేట స్వామి బోగీ కారుణకర్, డాక్టర్ మహేందర్ డాక్టర్ పాష కనకయ్య ఎల్లమ్ లింగం ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
`కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.
`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.
`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.
`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్.
`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్.
`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే
`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.
`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్.
`తెలంగాణ ఉద్యమకారులను గన్ తో బెదిరించిందే రేవంత్.
`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్.
`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్.
`రేవంత్ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.
`తెలంగాణ లో కాంగ్రెస్ కు చోటు లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ అంటే హైదరాబాద్లో కర్ఫ్యూ. హైదరాబాద్లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్సాగర్లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్ను కడిగిపారేశారు. కాంగ్రెస్ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… ఈ తరానికి కాంగ్రెస్ అంటే ఏమిటి? ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు. ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్పార్టీ. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్ లో ప్రచారం చేసిన షబ్బీర్ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం గా కావాలని బీఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం అజ్జకొలు గ్రామంలో సోమవారం కారుగుర్తు అభ్యర్థి ఆల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ
అజ్జకొలు గ్రామంలో 35 కోట్లతో 58 లక్షల నిదులతో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల మరియు సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించినం మళ్లీ కేసీఆరే సీఎంగా కావాలి అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి దేవరకద్ర గులాబీ జెండా ఎగురవేయాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేసినట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేవరకద్ర మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. ప్రచారంలో భాగంగా మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆల ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వివిధ గ్రామాల ప్రజలను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టు తిమ్మప్ప , కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ,జడ్పిటిసి కృష్ణయ్య , బాలమనెమ్మ ,పాల్గొన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఆరోగ్యం క్షీణించి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు అఖండమైన భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపొంది తెలంగాణ చట్టసభల్లో శాసన సభ్యురాలుగా అడుగు పెట్టాలని ఓదెల గ్రామంలోని పార్వతీ శంభు లింగేశ్వర ఆలయం లో అభిషేకం జరిపించారు.ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఉపాధ్యక్షులు బోయ సదానందం ,మండల మహిళా కన్వీనర్ మేకల శోభ ,ఓదెల సెక్టార్ అధ్యక్షుడు బీరం రవి,6 వార్డ్ మెంబర్ రాచర్ల నిర్మల రాజేశం,మాజీ వార్డ్ మెంబర్ బుద్దే మహేష్,ముదిరాజ్ సంఘం డైరెక్టర్స్ తూడి రాజయ్య,తూడి ప్రవీణ్ , పెండం ఓదెలు,పసెట్ల స్వామి,ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ,మరియు పార్టీ కార్యకర్తలు తూడి సంధ్య,ఓల్లాల రజిని,నూతి రమాదేవి,పందెన దీపిక,కొండ్ర చర్మిల,చిలుముల శ్రీలత,గడ్డం సునీత, నూతి రాజేందర్,ఎంబడి రాజు,గాండ్ల శరత్, వంశీ,గడిగొప్పుల నవీన్,రామినేని కోటి, రామినేని స్వామి,అప్పని మధు,కొండ్ర సాగర్,కొండ్ర వెంకటేష్,రేగుల తిరుపతి,రేగుల రాజేందర్,కొండ్ర సంతోష్ తుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మోడల్ స్కూల్లో సోమవారం రోజున 10వ తరగతి ప్రత్యేక తరగతులను సందర్శించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను కోరారు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశముల మేరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కొనసాగించాలిఅని. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచనలు చేస్తూ ఉపాధ్యాయులు ఎస్ ఏ -1పరీక్ష ఫలితాలలో వచ్చిన విద్యార్థి స్థాయిని బట్టి ఏబిసి గ్రూపులుగా విభజించి సీ గ్రూపు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని. ఉపాధ్యాయులు వారిని అడాప్ట్ చేసుకోవాలిఅని వెనుకబడిన విద్యార్థులపై ప్రారంభము నుండే ప్రత్యేక శ్రద్ధ చూపాలిఅని . విద్యార్థుల ఇండ్ల ను సందర్శించి 100% హాజరు కొరకు కృషి చేయాలి. ఎవరైనా ఉపాధ్యాయులు రానిచో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. డిసెంబర్ 2023 వరకు సెలబస్ పూర్తి చేయాలి. రివిజన్ చేయడానికి ప్రత్యేక తరగతుల కాల నిర్ణయ పట్టికను తప్పక అమలు చేయాలి .ప్రత్యేక తరగతుల నిర్వహణ సజావుగా జరిగేటట్లు ప్రధానో పాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన కృషి చేయాలి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక నిర్వహణకు తప్పనిసరిగా హాజరు కావలెను ప్రత్యేక తరగతుల నిర్వహణ కొరకు ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలి పర్యవేక్షణ అధికారులు సందర్శించినప్పుడు అట్టి రిజిస్టర్లను చూపించాలని ఉపాధ్యాయులను కోరినారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరీ తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాడవాడల తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటిది పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మూడు నుంచి ఐదు గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున ఇచ్చిన హామీలన్నీ మరిచిందని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అలాగే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రియతమ మంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని వాడ వాడలా గడపగడప ప్రచారం చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏం సి డైరెక్టర్లు మైనార్టీ మహిళ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఇట్టి ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.