ఇంటింటా ప్రచారం నిర్వహించిన చల్లా జ్యోతి

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సతీమణి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజారిటీ తో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ నెల 30న జరిగే ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు చేయాలనీ పరకాల ను అభివృద్ధి చేయాలంటే ధర్మన్న నే సరైన నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సనత్ పటేల్, పరకాల పట్టణ మాజీ మహిళ అధ్యక్షురాలు గంట కళావతి, మహిళ నాయకురాళ్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version