2 లక్షల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి:

భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు
ఉదయం గోదావరి బ్రిడ్జి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద విజయ లక్ష్మి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ కు చెందిన ముడిమాడుగుల జగదీష్ మోటార్ సైకిల్ లపై 10 కిలోల గంజాయినీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ సీలేరు వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. మరో ఒకరు అంగోతు నిఖిల్ మోటార్ సైకిల్ దిగి పారిపోవడం జరిగింది. గంజాయి విలువ 2 లక్షలు ఉంటుంది. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!