బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 197వ జయంతి వేడుకలు

కాటారం నేటి ధాత్రి

కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలోబహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల మండల అధ్యక్షుడు బొడ్డు రాజ బాబు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొడ్డు రాజబాబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలకు అభ్యున్నతి కొరకు , విద్యాభివృద్ధి కోసము కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే అని వారు కొని ఆడారు , సమాజంలోని ప్రజలందరూ మహనీయుల ఆలోచన విధానంలో నడవాలని బొడ్డు రాజబాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాటారం బి.ఎస్పి మండల ప్రధాన కార్యదర్శి ఎండి మౌలానా, నాయకులు మెట్టు పురుషోత్తం , బాపు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *