సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నేడు ఉద్యోగులు సమ్మెలో భాగంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి వినతిపత్రాన్ని అందజేశారు.
భద్రాచలం నేటి ధాత్రి
ముందుగా ఉద్యోగస్తులందరూ భద్రాచలం పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు.
అనంతరం ఉద్యోగస్తులందరూ స్వామివారిని దర్శించుకుని మా న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారు కరుణించి వెంటనే మాకు రెగ్యులర్ చేయాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆరోగ్య భద్రత కల్పించాలని మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ చందు మహిళా అధ్యక్షురాలు ఏం తులసి కార్యనిర్వాహక అధ్యక్షులు సిద్దయ్య సలహాదారులు వనమా సురేష్ కవిత, పార్వతి రామారావు విజయ్, గోపి ,అర్జున్ ఉద్యోగులు పాల్గొన్నారు