
Heavy Rain
సంగారెడ్డి జిల్లాలో 13.7 సెంటీమీటర్ల వర్షం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి
వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మొగుడంపల్లి 0.73 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఝరాసంగం వాలాద్రి వాగు పొంగి ఏడాకులపల్లి, ప్యారవరం, ఎల్లోయి, జీర్లపల్లి చెరువు పొంగడంతో మంజీరాకు వరద నీరు వెళుతుంది. ప్యారవరం వాగు ఎప్పటి మాదిరిగానే పొంగిపొర్లుతోంది. కుప్పానగర్, మచ్నుర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెర వాడ, చిలేపల్లి, చిలపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు..
పుల్ కల్ (లక్ష్మీసాగర్) – 13.7 సెంటీమీటర్లు
గుమ్మడిదల (నల్లవల్లి) – 9.70 సెంటీమీటర్లు
చౌటకూర్ (చౌటకూర్) – 8.89 సెంటీమీటర్లు
అమీన్ పూర్ (సుల్తాన్ పూర్) – 8.10 సెంటీమీటర్లు
ఝరాసంగం (ఝరాసంగం) – 7.48 సెంటీమీటర్లు
నిజాంపేట్ (నిజాంపేట్) – 6.60 సెంటీమీటర్లు
పుల్ కల్ (పుల్ కల్) – 5.93 సెంటీమీటర్లు
రాయికోడ్ (రాయికోడ్) – 5.73 సెంటీమీటర్లు
హత్నూర్, వట్ పల్లి, అమీన్ పూర్, జిన్నారం ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా పటాన్ చెరువు, రామచంద్రపురం, సదాశివపేట్, జహీరాబాద్, కంది ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. మిగతా ప్రాంతాల్లో మోస్తారుగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.