శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు గట్లకానీపర్తి శివారులో ఒక టాటా ఏసీ ట్రాలీ వాహనంలో రేషన్ బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉందని నమ్మదగిన సమాచారం మేరకు వెంటనే సిబ్బందితో అక్కడికి వెళ్ళగా ఒక టాటా ఏసీ వాహనం బియ్యం లోడుతో ఉన్నది. మా రాకను గమనించిన ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని పట్టుకొని విచారించగా ఎండి తాజుద్దీన్ వెల్లంపల్లి గ్రామం పరకాల మండలం అని అన్నారు.వివిధ గ్రామాలలో ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్మాలని ఉద్దేశంతో వెంకటేశ్వర బెన్ని రైస్ మిల్ వద్దకు రావడం జరిగిందనీ అని అన్నారు.వెంటనే పంచనామా జరిపి నేరస్తుని ట్రాలీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
