పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ వార్డు కు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పదవ వార్డ్ సోషల్ మీడియా అధ్యక్షులు చెరుకు నాగరాజు,తెలంగాణ జాగృతి అధ్యక్షులు చెరుకు సురేష్,తెలంగాణ రాష్ట్ర యూత్ నాయకులు ఏడ్ల అరవింద్ కుమార్,పెండెల భరత్ కుమార్,జీడిమెట్ల అనిల్ కుమార్,చెరుకు లక్ష్మణ్ తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పదవ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,18వ వార్డు కౌన్సిలర్ ఏకు రాజు తదితరులు పాల్గొన్నారు.