
108 Prasadam Puja
బొజ్జ గణపయ్యకు108 ప్రసాదాలతో పూజలు.
మందమర్రి నేటిధాత్రి
గత 5 సంవత్సరాలుగా శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను జరుపుతున్నారు.
మందమర్రి శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము పండ్లు పలహారాలు 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కలిసి మన సాంస్కృతికి అనుగుణంగా చీరలు కట్టుకొని గణనాథుని పూజలో పాల్గొన్నారు.
తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన భక్తులు
ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.