హైదరాబాద్: హసన్నగర్ రాజేందర్నగర్లో సోమవారం రాత్రి 12 అడుగుల పొడవున్న కొండచిలువను స్థానికులు పట్టుకున్నారు.
స్థానికుల కథనం ప్రకారం మీర్ ఆలం వాటర్ ట్యాంక్ సమీపంలో కొండచిలువ కనిపించడంతో లారీ డ్రైవర్ స్థానికులకు సమాచారం అందించాడు. పాములను పట్టుకోవడంలో తెలిసిన స్థానికుడు 10 నుంచి 14 అడుగుల ఎత్తులో ఉన్న కొండచిలువను పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
కొండచిలువను అడవిలో వదలనున్నారు. కొండచిలువ కదులుతున్న దృశ్యంతో స్థానికుల్లో కాసేపు భయం నెలకొంది.
అయితే మీర్ ఆలం ట్యాంక్ రిజర్వాయర్ చుట్టూ పాములు తరచూ తిరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.