స్వయం పాలన కోసం సమైక్యంగా ఆదివాసీలు పోరాడాలి.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి పిలుపు

కారేపల్లి నేటి ధాత్రి:

అన్ని రంగాలలో వెనకబడి మరింత పేదలుగా మారుతున్న ఆదివాసీల సంపూర్ణ అభివృద్ధికి స్వయంపాలనే సరైన పరిష్కారమని అందుకు ఆదివాసీలు సమైక్యంగా ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య* పిలుపునిచ్చారు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కారేపల్లి మండల పరిధిలో టేకులగూడెం గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసి దినోత్సవం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు ఎవరైనాప్పటికీ ఆదివాసీలను విస్మరిస్తున్నారని అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలిస్తామన్న పాలకులు సంపూర్ణ స్థాయిలో ఆ పథకాన్ని అమలు చేయలేదని ఆయన అన్నారు. సహజ వనరులు సకల సంపదలు కలిగిన ఆదివాసీ ప్రాంతాల నుంచి ఆదివాసీను ఎలా కొట్టేందుకు వారిపై రాజ్యం హింసను ప్రేరేపిస్తుందని ఇది సరికాదని ఆయన అన్నారు. పాలకులు గిరిజనులు అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్నారు కానీ ఆదివాసీ ప్రాంతాల నుంచి వలసలు విపరీతంగా నగర ప్రాంతాలకు వెళ్తున్నారని పేదరికంలో వెనుక బాట్లు ఉండటానికి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు ఆదివాసీల యువకులు అనేకమంది నిరుద్యోగులుగా మారారని జీవో నెంబర్ 3 పునరుద్ధరించి ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.1/70 ఏరియాలో గిరిజనేతర్ల పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని గృహలక్ష్మి వారికి అమలు చేయాలని ఆయన సందర్భంగా కోరారు .పేదలందరికీ స్యాచురేషన్ పద్ధతిలో ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహకరించాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు గృహలక్ష్మి పథకం అప్లై చేసుకోవడానికి గడువును పొడిగించాలని ఆయన కోరారు కొమరం భీమ్ పోరాటాన్ని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆదివాసీ ప్రాంతాల్లో జల్ జమీన్ జంగలి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు దానికన్నా ముందు ఆదివాసీల జెండాను ఎగరవేసి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .
ఈ కార్యక్రమంలో ప్రజాపంద ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ సహాయ కార్యదర్శి రాకేష్ నాయకులు లక్ష్మీనరసు భాస్కర్ లక్ష్మీనారాయణ అనసూయ కనకరాజు ఆదినారాయణ కోటి భద్రన్న రంగ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!