సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా మామిడి అశోక్

శాయంపేట, నేటిధాత్రి: టిఆర్ఎస్ పార్టీ శాయంపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కొప్పుల గ్రామానికి చెందిన మామిడి అశోక్ ఇటీవలే నియమితులు కాగా సోమవారం గండ్ర దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,

వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతిరమణరెడ్డి దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ మామిడి అశోక్ ను శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు గండ్ర దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఎంపికైన మామిడి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, 

వైస్ ఎంపీపీ లతాలక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు ఉప సర్పంచులు,

టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు

పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!