ఊర్లకు ప్రగతి దారులు…
కొత్త తరం విద్యాలయాలు…
పేదలకు ఇండ్ల వరాలు…
ఆపద అని వస్తే ఆదుకుంటాడు
ఆరోగ్యం కోసం వెళ్తే వైద్యం చేయిస్తాడు
గుడి కోసమంటే కదిలొస్తాడు…
వైద్యం కోసమంటే చలిస్తాడు…
బడి కోసమంటే ముందూ వెనుక చూసుకోడు…
ఎవరొచ్చినా కాదనడు…లేదనడు..సాయం చేయకుండా పంపడు.
బడైనా, గుడైనా, ఊరంతా బాగు చేయాలన్నా ఆయన చెవిన పడితే చాలు…
నేనున్నానంటాడు…ముందుకొస్తాడు…
ఇలాంటి వ్యక్తి తెలంగాణలో మరొకరు లేరు…
జనం గుండెల్లో సుభాష్రెడ్డి నింపిన వెలుగులు…
తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి…ఆ నిర్మాణాలు…
అనుకోవడం వేరు. ఆలోచన చేయడం వేరు. ఆచరించడం వేరు. కల గనడం వేరు. నెరవేర్చగవ వేరు. సాయం చేయడం వేరు. ఆదుకోవడం వేరు. తన వారితో ప్రేమతో వుండడం వేరు. ఆపదలో అండగా నిలవడం వేరు. ఊరు బాగు చేయడం వేరు. ఊరంతా పంగడ చేయడం వేరు. అందరం అనుకోవం వేరు. మనమంతా ఒక్కటే అనకోవడం వేరు. అందరి ఆనందం వేరు. సుభాష్రెడ్డి కోరుకునే అందరి సంతోషం వేరు. ఇది ఎవరూ తీర్చలేనంతది.
ఎవరూ ముందుకొచ్చి చేయలేనంతది. అందుకే సాయాలెందరు చేసినా సుభాష్రెడ్డి చేసే సాయమే వేరు…ఆయన సాయం సానుభూతితో చేసేది కాదు. సహకారంలో భాగంగా చేయడం. సమాజంలో ప్రగతి కోసం చేసేది. సమాజ పరిణతి కోసం చేసేది. ఆదుకోవడమంటే అలాంటి ఇలాంటి ఆదుకోవడం కాదు. అక్కున చేర్చుకోవడం. దగ్గరుండి అవసరాలు తీర్చడం. ఆపదలో వున్నాడని తెలిసి అండగా వుండడం. ఇవన్నీ మరెవరూ చేయలేనివి. మనసున్న మనిషిగా ఒక్క సుభాష్రెడ్డి మాత్రమే చేయగలిగేవి.
నేను అనే పదం ఆయన దృష్టిలో చాలా చిన్నది. ఈ రెండక్షరాలను విడదీస్తే విశ్వమంత పెద్దది. నేను అనే పదంలో నువ్వు,నేను అన్నది వున్నది. ఆ రెండు సుభాష్రెడ్డి గుండెల్లో వున్నవి. అందుకే అతనొక ప్రపంచం. నేను అన్న స్వార్ధం అతనిలో ఎప్పుడూ లేదు. నాలో మీరంతా వున్నారంటారు. మీ కోసమే నేనున్నారంటారు. మీ కోసం ఏదైనా చేస్తానంటాడు. కష్టపడడమే ఆయనకు తెలుసు. కూడబెట్టడం తెలియదు. దాచుకోవడం అసలే తెలియదు. తోటి వారి అసవరాల కోసమే తన కష్టార్జితం వినియోగిస్తుంటాడు. వారిని ఆదుకుంటుంటాడు. అడిగింది ఇస్తుంటాడు. మీరే నా ప్రాణమంటుంటాడు. సాటి మనుషులను ప్రాణంగా చూసుకుంటుంటాడు. తన చేతికి ఎముక లేనంతగా సాయం అందిస్తుంటాడు. అడిగింది కాదనడు. లేదన్న మాట చెప్పడు. ఎందుకంటే ఆయనకు ఊరంటే ఇష్టం. తోటి వారంటే ప్రాణం. ఆయన ఎప్పుడూ చెప్పేది మనమంతా ఒక కుటుంబం. ఈ రోజుల్లో ఒకరికి మరొకరు సాయం అందించడమే గొప్ప. అలాంటిది అదేదో సినిమాలో మహేష్బాబు ఊరును దత్తత తీసుకున్నట్లు తెర మీద చూశాం. ఔరా అని ముక్కున వేలేసుకున్నాం… కాని మన తెలంగాణలో సుభాష్రెడ్డిని నిజంగానే చూస్తాం. అయితే ఆయన ఒక్క ఊరు కాదు, ఊర్లను దత్తత తీసుకున్నాడు. దత్తత అంటే అలాంటి ఇలాంటి దత్తత కాదు…ఊరంతా పండగ చేసుకునేంత…
ప్రార్ధించే చేతులకన్నా, సాయం చేసే చేతులు మిన్నా అని వివేకానందుకుడు అన్నారు. ఏ గడిలో ఆ మాట అన్నాడో గాని, సుభాష్రెడ్డి లాంటి వారు భవిష్యత్తులో వస్తారని ఊహించే అన్నారేమో! అనిపిస్తోంది. వేల కోట్లు వున్నవారు కూడా సాయం చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అర్ధించడమే ఆలస్యం. సాయం చేస్తూ పోయేవారున్నారు. అందులో సుభాష్రెడ్డి ముందు వరసలో వుంటారు. స్నేహుతుల హితం కోరుతాడు. స్నేహితులంతా సంతోషంగా వుండాలనుకుంటాడు. ఇరుగు పొరుగు ఆనందంగా వుండాలనుకుంటాడు. వారి ఆనందం కోసం ఏదైనా చేస్తాడు. ఊరంతా దత్తత తీసుకుంటాడు. ఊరికేమేమి అవసరమో! అన్నీ సమకూర్చుతాడు. వ్యక్తి గత అవసరాల నుంచి మొదలు, సమాజ అవసరాలన్నీ తీర్చుతాడు. ఊరుకోసం ఏదైనా చేస్తాడు. ఎంతైనా చేస్తాడు. అందుకే ముందుగా తన ఊరి ప్రజలకు తోడుగా నిలిచాడు. అండగా నిలిచాడు. అవసరం కోరి వచ్చిన వారికి ఆదుకున్నాడు. విద్యా, వైద్యం విషయంలో లేదనకుంటా సాయాలు చేస్తూ వస్తున్నాడు. ఎంత ఖర్చైనా సరే ప్రాణాలు నిలుపుతూ వస్తున్నాడు. గుళ్లుకు చందాలు, విద్యార్ధులకు స్కాలర్షిప్లు, వైద్యాని వేలాది రూపాయలు అందిస్తూనే వుంటారు. జిల్లాలో ఏ ఊరులో గుడి కట్టాలనుకున్నా ముందు వచ్చేది సుభాష్రెడ్డి గడప తొక్కితే చాలు…అన్నంత పేరు సొంతం చేసుకున్నారు. ఇక తన ఊరు గొప్పగా వుండాలనకున్నాడు. అందుకు ఎంత ఖర్చైనా ఫరవాలేదనుకున్నాడు. బాగు చేయడం మొదలు పెట్టాడు. ఊరును పట్టణమంతా సుందరం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడకల ఇండ్లను అద్దాల్లాంటి మేడలుగా నిర్మించాడు. పేదల ఇండ్లంటే నమ్మలేనంత సుందరంగా తీర్చిదిద్దాడు. అందమైన కాలనీ నిర్మాణం చేశాడు. ప్రకృతి రమణీయతకు నిలయం చేశాడు.
రాష్ట్రమంతా అబ్బురపడిపోయేలా సుందర వనం చేశాడు. ఊరులోనే కొత్త వాడను కొత్త ఇండ్లతో ముస్తాబు చేశాడు. వారికి కొత్త లోకాన్ని పరియచం చేశాడు. వారి జీవితాలకు భరోసా నింపాడు. వారి సొంతింటి కలను నిజం చేయడం కాదు. ఇల్లే కద స్వర్గ సీమ అంటే ఇలా వుంటుందని కట్టిచూపించాడు. వారికి తన అభిమానాన్ని పంచి, బహుమానంగా ఇండ్లు నిర్మించి ఇచ్చాడు. ఊరురుకి గుడి కావాలి. దేవుడు కొలువుండాలి. అదే ఊరులో బడి వుండాలి. విద్యాలయం ఒక ఉపనిషత్తులుగా వెలుగొందాలి. అది సుందరమైన, సౌకర్యవంతమైనది వుండాలి. విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బడి వుండాలి. ఏ కార్పొరేట్ పాఠశాల కూడా వుండనంత ఉన్నంతగా బడి నిర్మించాడు. తను చదువుకున్న బడిని కొత్తగా ముస్తాబు చేశాడు. మరిన్ని తరాల దాకా చెక్కు చెదరకుండా, ఆయన పేరుకు కీర్తి కిరీంటంగా, తన తల్లిదండ్రుల పేరు చిరస్ధాయిగా నిలిచిపోయలా నిర్మాణం చేశారు. పుస్తకమంటే ఇష్టం. అందుకు పుస్తక ప్రపంచం కోసం గ్రంధాలయం నిర్మించాడు. కన్న ఊరు రుణం ఇలా తీర్చుకుంటున్నాడు. ఇలా ఎంత మంది చేస్తారు. ఒక్క సుభాష్ రెడ్డి మాత్రమే కనిపిస్తారు…