నియామక పత్రాన్ని అందజేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట నేటిధాత్రి…
సిద్ధిపేట జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన, సహాయక కార్యదర్శులుగా, రచ్చ సంతోష్ కుమార్, మరియు రాధారం బాబులను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ ఎజెండా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో జరిగే అవినీతి అక్రమాలను వెలికితీసి వాటిని న్యాయస్థానాల ద్వారా అరికట్టడానికి, అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం, లీగల్ ప్రొసీజర్తో మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి నిస్వార్ధంగా పని చేస్తుందన్నారు. తధనంతరం నూతనంగా ఎన్నికైన రచ్చ సంతోష్, రాధారం బాబు లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిటీ నీతి ఆయోగ్ ద్వారా ఆమోదం పొందిన స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉద్భవించిన సంస్థ ఎన్ హెచ్ ఆర్ సి సంస్థ అని, మరియు పేద ప్రజల పక్షాన ముందుండి జిల్లా అధ్యక్షునికి ఎల్లవేళలా సహకరిస్తూ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి సాయి, అఖిల్ , ఇన్యాలపు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.