సర్వాయి పాపన్న ఆశయం బహుజన రాజ్యంతోనే సాధ్యం

శనిగరపు రాజు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ:నేటిధాత్రి బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్ లో యుద్ధ వీరుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఏకశిలా పార్కు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది
ముఖ్య అతిథులుగా జోనల్ మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మ పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు మాట్లాడుతూ ఈ పెత్తందారి దోపిడి వ్యవస్థను అంతమొందించి గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించి జమిందార్ల దోపిడిని అరికట్టిన యుద్ధ వీరుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తన గ్రామమైన ఖిలషాపూర్ నుండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర ను రాష్ట్రవ్యాప్తంగా సర్వాయి పాపన్న లక్ష్యాన్ని ప్రచారం చేస్తూ సర్వాయి పాపన్న రాజ్యాన్ని నిర్మించడం కోసం అహర్నిశలు తిరుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసి తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఆర్.ఎస్.పి యాత్ర చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని అన్నారు ప్రశ్నిస్తేనే ఇంత శరవేగంగా నిర్ణయాలు జరిగితే రానున్న రోజుల్లో ఆర్ఎస్పీ ముఖ్యమంత్రి చేసుకుంటే బహుజన జాతులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని రానున్న రోజుల్లో ఆర్ఎస్పి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం బహుజన జాతులన్నీ కలిసి రావాలని సర్వాయి పాపన్న ఆత్మను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో చూసుకోవాలని పిలుపునిస్తూ ఆర్ఎస్పి ముఖ్యమంత్రి కావడం ద్వారా మాత్రమే సర్వాయి పాపన్న ఆశయం నెరవేరుతుందని శనిగరపు రాజు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జిలు అమ్మ సాంబయ్య, పసుల వినయ్ అంబేడ్కర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి మినాజ్, అధ్యక్షులు బొట్ల నితిన్, ఎస్ ఎస్ యు అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్, సీనియర్ నాయకులు దూడపాక జలేంధర్,నిరంజన్, శనిగరపు రమేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *