వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం. జిల్లాలో మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి ఉచిత కంటి శస్త్ర చికిత్స చేయడం జరిగింది.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన లింగవ్వ వయసు (45)కంటి సమస్య తో ఏరియా ఆస్పత్రికి రావడం జరిగింది. సదరు రోగిని పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించాము.దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడ ఆస్పత్రిలో పూర్తిస్థాయి ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చెయ్యడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. మహేష్ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం డాక్టర్ మురళి కృష్ణ, డాక్టర్ రత్నమాలమరియు థియేటర్ అసిస్టెంట్ నరసింగం, రాజేందర్ పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!