వివేకానంద లో యోగ ప్రచార తరగతులు యోగ డే పురస్కరించుకొని యోగా అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాను విద్యార్థులకు ప్రచారం నిర్వహించడానికి స్థానిక ,,యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ,,సోమవారం నుంచి ప్రత్యేక యోగ ప్రచార తరగతులు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు .ఈ సందర్భంగా స్థానిక వివేకానంద విద్యాలయం లో విద్యార్థులకు యోగాపై అవగాహన ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పతాంజలి మహర్షి రచించిన యోగ శాస్త్రం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది .అష్టాంగ యోగం లైన యమ. నియమ. ఆసన. ప్రాణాయామ. ప్రత్యాహార . ధారణ .సమాధి .గురించి వివరించడం జరిగిందని కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు .విద్యార్థులు యోగ ధ్యాన ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలో తెలపడం జరిగింది .అని ఆయన తెలిపారు. ఈ వారం రోజులు ప్రత్యేక యోగ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!