వినాయక నిమజ్జనంలో డీజే లకు నో పర్మిషన్…. ఎస్సై ఎన్ శ్రీధర్

 

ఓదెల,(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:-

వినాయక వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని పొత్కపల్లి ఎస్ ఐ ఎన్. శ్రీధర్ అన్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు ఈ నెల 18న ప్రారంభం కానున్న గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను మరియు గణేష్ మండపం నిర్వాహకులతో పోత్కపల్లి ఎస్సై ఎన్ శ్రీధర్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ పండుగ వేళ ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని మండపాల నిర్వహుకులకు సూచించారు.వినాయక మండపాల వద్ద రాత్రి 10గంటల వరకే స్పీకర్లు వినియోగించాలని, వినాయక నిమజ్జనం లో డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని ఎవరైనా మండపాల వద్ద గొడవలు, పేకాట, మద్యపానం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మండపాల వద్ద రోజంతా కనీసం ఒక వాలంటీర్‌ ఉండే విధంగా నిర్వాహకులు ప్లాన్‌ చేసుకోవాలని, మండపాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా నాణ్యత గల విద్యుత్‌ వైర్లను ఉపయోగించేలా ని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!