ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాలు మీడియా విద్యాలయాల్లోకి రావద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని ఎఐఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె షాహిద్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సెక్రటేరియట్ ముట్టడి తలపెట్టి ముందుకు సాగుతున్న సందర్భంలో విద్యార్థి నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్ మరియు రాష్ట్ర నాయకులపై బూతు మాటలతో మరియు చేయి చేసుకోవడం సెక్రటేరియట్ వద్దకు మీరు రావద్దు అంటూ మీడియా ఉందన్న విచక్షణ కూడా లేకుండా ఆగ్రహంతో ఊగిపోతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని, మానవ హక్కులను తుంగలో తొక్కి, ఫ్రెండ్లీ పోలీసులను గాలికి వదిలేసి అకారణంగా అన్యాయంగా విద్యార్థి నాయకుల పై దాడి చేయడం సిగ్గుచేటని ఈ దాడికి పాల్పడిన డీసీపీ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్
చేశారు. లేకుంటే హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ని సంప్రదిస్తామని,రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.